News March 30, 2024

ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అత్యధికంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. జిల్లాలోని మరో 12 ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41.5 డిగ్రీల వరకు నమోదుకాగా.. ఎండలకు తోడు వడగాలులు మొదలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 2 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Similar News

News April 18, 2026

ఖమ్మం జిల్లాలో 41.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత

image

ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, కల్లూరు మండలాల్లో 41.6 డిగ్రీలు నమోదవగా, కల్లూరు, రఘునాథపాలెం, ఏన్కూర్ ప్రాంతాల్లో 41.4 నుంచి 41.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెనుబల్లి, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో 41.2 నుంచి 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

News April 18, 2026

ఖమ్మం జిల్లాలో 41.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత

image

ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, కల్లూరు మండలాల్లో 41.6 డిగ్రీలు నమోదవగా, కల్లూరు, రఘునాథపాలెం, ఏన్కూర్ ప్రాంతాల్లో 41.4 నుంచి 41.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెనుబల్లి, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో 41.2 నుంచి 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

News April 18, 2026

ఖమ్మం: వానాకాలం సాగుకు విత్తనాలు సిద్ధం

image

ఖమ్మంలో వానకాలం సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకుని 30 వేల క్వింటాళ్ల విత్తనాల సరఫరా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వరితో పాటు పెసర, మినుము, కంది విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.