News March 30, 2024

మెదక్: ‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి హరీశ్ రావు’

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి మాజీ మంత్రి హరీశ్ రావు అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం మెదక్‌లో మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందుకు గురి చేశారని మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో మామను మించిన వ్యక్తి హరీశ్ రావు అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Similar News

News November 8, 2025

మెదక్ జిల్లాలో 14,15 తేదీల్లో కవిత పర్యటన

image

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత ఈనెల 14, 15 తేదీల్లో మెదక్ జిల్లాలో పర్యటించానున్నారు. 14న మెదక్ జిల్లా శివంపేట నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నర్సాపూర్, కౌడిపల్లి, కుల్చారం మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. 15న మెదక్ పట్టణం నుంచి ఏడుపాయల సందర్శిస్తారు. పలు సందర్శన అనంతరం మెదక్‌లో మేధావుల సమావేశంలో పాల్గొంటారు. కేవల్ కిషన్ సమాధి సందర్శించనున్నారు.

News November 8, 2025

మెదక్‌లో 5,857 ఇందిరమ్మ ఇళ్ల పనులు షురూ

image

మెదక్ జిల్లాలో మంజూరైన 9,181 ఇందిరమ్మ ఇళ్లలో 5,857 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. ఇంకా 3,324 ఇళ్ల పనులు మొదలుకాలేదన్నారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ. 45 కోట్లు చెల్లించినట్లు వివరించారు. 400 అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న లబ్ధిదారులుపై అంతస్తులో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చని ఆయన సూచించారు. బేస్‌మెంట్, స్లాబ్ స్థాయిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

News November 7, 2025

మెదక్ పోలీస్ మైదానంలో వందేమాతరం గీతాలాపన

image

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వందేమాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందితో పాటు మెదక్ టౌన్, రూరల్, హవేలిఘనపూర్ పోలీసులు పాల్గొన్నారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ దేశభక్తి గీతానికి నేటికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ తెలిపారు.