News March 30, 2024
మెదక్: ‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి హరీశ్ రావు’

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి మాజీ మంత్రి హరీశ్ రావు అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం మెదక్లో మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందుకు గురి చేశారని మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో మామను మించిన వ్యక్తి హరీశ్ రావు అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
Similar News
News April 19, 2025
మెదక్: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT
News April 19, 2025
సిద్దిపేట: కరెంట్ షాక్తో బాలుడి మృతి

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
News April 19, 2025
సిద్దిపేట: తల్లీ, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు

తల్లీ, కొడుకు అదృశ్యమైన ఘటన జగదేవ్పూర్(M)లో జరిగింది. స్థానికుల వివరాలు.. దౌలాపూర్కు చెందిన లావణ్యను పదేళ్ల కింద గజ్వేల్(M) కొల్గురుకు వాసి కృష్ణతో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో లావణ్య చిన్న కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గురువారం రాత్రి నుంచి లావణ్య కనిపించకపోవడంతో శుక్రవారం తండ్రి మల్లయ్య PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.