News March 30, 2024
రాష్ట్రంలోనే తొలిసారి బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు
AP: రాష్ట్రంలోనే తొలిసారి ఓ దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాలు ఇస్తామని చెప్పి క్రేసుల్లా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తన వద్ద ₹2.9 లక్షలు తీసుకుని మోసం చేసిందని అనకాపల్లి(D) జల్లూరుకు చెందిన దివ్యాంగుడు ఈ ఫిర్యాదు చేశారు. అలాగే తన స్నేహితుడి వద్ద ₹11 లక్షలు తీసుకుని దగా చేసిందని పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 5, 2025
ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని NTR వైద్యసేవ CEOను ఆదేశించింది. ఇప్పటి వరకు TGలో 11 ఆస్పత్రుల్లోనే NTR వైద్యసేవ ట్రస్టు సేవలు అందుతున్నాయి. దీంతో 2015 తర్వాత ట్రస్టు గుర్తింపులేని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.