News March 30, 2024

వైసీపీ నుంచి సిద్ధం.. జనసేన నుంచి ఎవరు.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం MP, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అభ్యర్థులను పవన్ ప్రకటించలేదు. దీంతో ఇక్కడ పోటీ విషయమై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపు YCP నుంచి సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి రమేశ్ బాబు ఎన్నికలకు సిద్ధమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా జనసేన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.

Similar News

News September 8, 2025

MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

image

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

News September 8, 2025

యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు: కలెక్టర్

image

యూరియా సరఫరాపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ యూరియా సరఫరాకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.

News September 8, 2025

శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

image

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.