News July 4, 2025

ఏలూరు: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

image

ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిపై అల్లూరి చేసిన స్వాతంత్ర్య పోరాటం మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

GWL: కట్టుకున్న వారే కడతేర్చుతున్నారు!

image

జీవితాంతం కలిసుంటామని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్యాభర్తలు కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. నడిగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. GWLలో తేజేశ్వర్‌ను భార్య ఐశ్వర్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. అయిజ మాలపేటలో మాజీ భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, కుమారుడికి పెళ్లి కావడంలేదని తండ్రీకొడుకులు కలిసి హత్య చేశారు. దీంతో పెళ్లిచేసుకోవాలంటేనే యువతలో భయం పుడుతోంది.

News July 5, 2025

ఆ 11 మంది ఏమయ్యారు?

image

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

News July 5, 2025

KNR: రేపు జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్స్

image

సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్‌లో జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం నిర్వహించనునట్లు జిల్లా హాకి జాయింట్ సెక్రటరీ తిరున హరి శ్రీనివాస్ తెలిపారు. ఈ హాకీ ట్రయల్స్ కోసం ఆసక్తి గల జిల్లాలోని హాకీ క్రీడాకారులు తమ పేర్లను జిల్లా ఇన్ఛార్జి సెక్రటరీ అలీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7075667465, 9949029440 నంబర్లను సంప్రదించాలని కోరారు.