News July 4, 2025

పాడేరులో మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు

image

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి శుక్రవారం పాడేరు కలెక్టరేట్‌లో ఘనంగా జరగింది. కలెక్టర్ దినేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శర్మన్ పటేల్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

MBNR: ట్రిపుల్ ఐటీ మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు

image

మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో ఎంపికైన 66 మంది విద్యార్థులకు ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వీసీ గోవర్ధన్ శుక్రవారం వెల్లడించారు. ఈనెల 7న జాబితాలోని S.No-1-564 వరకు, 8న 565-1,128 వరకు, 9న 1,129-1,690 వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికేట్లతో ఉదయం 9 గంటల వరకు IIITలో హాజరుకావాలని కోరారు. SHARE IT.

News July 5, 2025

పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.

News July 5, 2025

బాలినేనికి ఇక అంతా బాగేనా?

image

బాలినేనిని జిల్లా రాజకీయాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనిపేరు. అటువంటి బాలినేనికి ఇకపై అంతా మంచే జరగబోతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మార్కాపురానికి డిప్యూటీ CM పవన్ వచ్చిన సందర్భంగా బాలినేని ప్రత్యక్షమయ్యారు. మళ్లీ వైసీపీలోకి బాలినేని అంటూ పుకార్లు వినిపిస్తుండగా, ఇక్కడ కనిపించడంతో ఓ క్లారిటీ వచ్చింది. పవన్ ప్రసంగంలో బాలినేని మంచి నేత అని చెప్పడంతో, ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాక్ నడుస్తోంది.