News July 4, 2025
జగిత్యాల: ‘మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం’

మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్య 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత తదితరులున్నారు.
Similar News
News July 5, 2025
MBNR: అరుణాచలానికి స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

గురు పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 8న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 10న రాత్రి అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 11న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600(ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 94411 62588, 99593 26286లకు సంప్రదించాలన్నారు. SHARE IT
News July 5, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దుల్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి శనివారం ఉదయం నాటికి 1,22,630 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876.90 అడుగుల వద్ద 169.8650 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 292 క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 26,140 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
News July 5, 2025
మొగల్తూరు: చేపకు మనిషి లాంటి దంతాలు

మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వం రోడ్లో ఒక రైతుకు చెందిన చేపల చెరువులో రూపు చందు చేపల్లో ఒక చేప వింత పోలికలతో కనిపించింది. మనిషిని పోలిన దవడ పళ్లు ఉన్న చేప దొరికింది. ఇది హర్యానా జాతికి చెందిన చేపని మత్స్యకారులు అంటున్నారు. చేపల పెంపకం దారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుందంటున్నారు.