News July 4, 2025
ఆయిల్ పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగులో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు ప్రోత్సాహంపై ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News July 5, 2025
B2 బాంబర్స్తో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

249వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్ బాంబర్స్ వైట్హౌస్ మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి మెలానియాతో పాటు ట్రంప్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్హౌస్ Xలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా ఆర్మీ ఈ B2 బాంబర్స్తోనే దాడి చేసింది.
News July 5, 2025
MBNR: అరుణాచలానికి స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

గురు పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 8న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 10న రాత్రి అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 11న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600(ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 94411 62588, 99593 26286లకు సంప్రదించాలన్నారు. SHARE IT
News July 5, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దుల్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి శనివారం ఉదయం నాటికి 1,22,630 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876.90 అడుగుల వద్ద 169.8650 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 292 క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 26,140 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.