News July 4, 2025
కూటమిపై ప్రజలకు నమ్మకం పోయింది: అమర్నాథ్

కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు ఆ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సబ్బవరంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో గుడివాడ మాట్లాడుతూ.. బాబు షూరిటీ-మోసం గ్యారంటీ టైటిల్ బాబుకి సరిగ్గా సరిపోతుందన్నారు. అర్హులకు పెన్షన్లు అందడం లేదన్నారు.
Similar News
News July 5, 2025
బాధ్యతలు స్వీకరించిన రామ్చందర్ రావు

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఎన్టీఆర్: నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ఏఎన్ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఎంహెచ్ఓ శర్మిష్ఠ ఏఎన్ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.