News July 5, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

Similar News

News July 5, 2025

TU: CESSలో PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

image

తెలంగాణ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రొఫెసర్ రేవతి తెలిపారు. ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, పొలిటికల్ సైన్స్, కామర్స్ తదితర విభాగాల్లో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని పేర్కొన్నారు. వివరాలకు https.//cess.ac.in ను సందర్శించాలన్నారు.

News July 5, 2025

అల్లూరి: 90% సబ్సిడీపై 24,000 క్వింటాళ్ల వరి విత్తనాలు

image

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో గిరిజన రైతులకు 24,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఖరీఫ్ సీజన్‌లో పంపిణీ చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.బి.యస్ నంద్ శనివారం తెలిపారు. రాజ్ మా 4500, రాగులు 141, అపరాల విత్తనాలు 364, వేరుశెనగ 648 క్వింటాళ్లు అందజేశామన్నారు. జిల్లాలో దాదాపు 61,000 హెక్టర్లలో వరి పంట సాగు అవుతోందని వెల్లడించారు.

News July 5, 2025

10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని EU డిమాండ్

image

APSRTCలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు వెంటనే 11వ PRC బకాయిలు, పెండింగ్ DAలు చెల్లించాలని కోరింది. మరణించిన, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లు తక్షణం చెల్లించాలని నిన్న విజయవాడలో నిర్వహించిన ధర్నాలో కోరింది. అటు కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను RTCకే అప్పగించాలని EU స్పష్టం చేసింది.