News March 30, 2024
‘భారతరత్న’ అవార్డులు అందించనున్న రాష్ట్రపతి

భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవ వేడుక నేడు రాష్ట్రపతి భవన్లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందించనున్నారు. ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి భారతరత్న అందించింది. ఈ జాబితాలో బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు.
Similar News
News March 8, 2026
వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్లో ‘AK47’ ట్యాగ్లైన్కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
News March 8, 2026
రక్త పరీక్షలు.. ఎందుకు చేయించుకోవాలి?

* CBC(కంప్లీట్ బ్లడ్ కౌంట్): ఎర్ర, తెల్ల రక్త కణాల సంఖ్య, హిమోగ్లోబిన్, అనీమియా, లుకేమియా, ఇన్ఫెక్షన్ల గుర్తింపు
* లిపిడ్ ప్రొఫైల్: కొలెస్ట్రాల్& గుండె వ్యాధుల రిస్క్
* బ్లడ్ షుగర్(ఫాస్టింగ్&HbA1c): డయాబెటిస్ అంచనా
* థైరాయిడ్ ప్రొఫైల్(TSH, T3, T4): హార్మోనల్ సమస్యలు
* LFT, KFT: లివర్, కిడ్నీ హెల్త్ చెక్
* విటమిన్ D&B12: ఎనర్జీ, ఇమ్యూనిటీ, బోన్స్ హెల్త్
* CRP/ESR: ఇన్ఫెక్షన్ల గుర్తింపు
#ShareIt
News March 8, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఒక్క రోజే ఛాన్స్!

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్మన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1,012 పోస్టులున్నాయి. రైల్వే అధికారిక <


