News July 5, 2025

ప్రాథమిక విద్య నుంచే సైన్స్ వైపు మళ్లించాలి: కలెక్టర్

image

ప్రాథమిక విద్య నుంచి విద్యార్థులను సైన్స్ వైపు మళ్లించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కొమరం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఇన్స్పైర్ శిక్షణా కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో పాల్గొన్నారు. సైన్స్ అనేది జీవన సమస్యను పరిష్కరిస్తుందన్నారు. ఈ రోజుల్లో ప్రపంచమంతా సైన్స్ వైపు అడుగులు వేస్తుందని తెలిపారు.

Similar News

News July 5, 2025

HYDలో అత్యధికంగా బియ్యం పంపిణీ

image

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.

News July 5, 2025

మేడ్చల్‌లో అత్యధికంగా బియ్యం పంపిణీ

image

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.

News July 5, 2025

VKB: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.