News July 5, 2025
సంగారెడ్డి జిల్లాకు 19 ప్రభుత్వ పాఠశాలలు మంజూరు

సంగారెడ్డి జిల్లాకు నూతనంగా 19 ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జహీరాబాద్ మండలానికి 10, సంగారెడ్డి మండలానికి 4, రామచంద్రపురం మండలానికి 4, సదాశివపేట మండలానికి ఒక పాఠశాల మంజూరైనట్లు వెల్లడించారు.
Similar News
News July 5, 2025
వీఆర్వో, వీఏవోలకు మరో అవకాశం: మంత్రి

TG: రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి(GP0)ని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. VRO, వీఏవోలకు జీపీవోలుగా అవకాశం కల్పించడానికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో 3,453 మంది అర్హత సాధించారని వెల్లడించారు. భూసమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చామని వివరించారు.
News July 5, 2025
వరంగల్: హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఒక టైమ్ లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలన్నారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.
News July 5, 2025
ఏలూరు: కువైట్లో ఉద్యోగాలు.. జులై 12 ఆఖరు

కువైట్లోని నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ శనివారం తెలిపారు. సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వర్క్ అనుభవంతో ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన 25- 50 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ఉంటుందన్నారు. https://naipunyam.ap. gov.in వెబ్సైట్లో పేర్లు నమోదుతో పాటు, బయోడేటాను skillinternational@apssdc.in మెయిల్ చేయాలి.