News July 5, 2025

రాయపోల్: వడ్డేపల్లిలో మరోసారి చిరుతపులి కలకలం

image

రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇంతకు ముందు చిరుతపులి ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించినా పట్టుకోవడంలో విఫలం అయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్ శుక్రవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సమీపంలో చిరుత కనిపించడంతో భయాందోళను గురయ్యాడు. సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించాడు.

Similar News

News July 5, 2025

HYD: అమెరికాలో మన పోలీస్‌కు ‘GOLD’ మెడల్

image

USలోని అల్‌బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్‌లోని DGP ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్‌లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.

News July 5, 2025

HYD: అమెరికాలో మన పోలీస్‌కు ‘GOLD’ మెడల్

image

USలోని అల్‌బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్‌లోని DGP ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్‌లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.

News July 5, 2025

ఇలా అయితే అప్పన్న భక్తులు నడిచేదెలా?

image

సింహాచలం గిరిప్రదక్షిణను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులకు కొన్నిచోట్ల ఇబ్బంది తప్పేలా లేదు. పెదగదిలి నుంచి హనుమంతువాక వరకు సర్వీసు రోడ్డులో కాంక్రీటు పిక్క తేలి ఉంది. చెప్పులు లేకుండా నడిచే లక్షలాది అప్పన్న భక్తుల కాళ్లకు పిక్క గుచ్చుకునే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు. గతేడాది కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే భక్తులకు ఎదురయ్యింది.