News July 5, 2025
MBNR: అరుణాచలానికి స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

గురు పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 8న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 10న రాత్రి అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 11న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600(ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 94411 62588, 99593 26286లకు సంప్రదించాలన్నారు. SHARE IT
Similar News
News July 5, 2025
రామన్నపేట: ‘పెండింగ్లో 24.85 లక్షల చేయూత పెన్షన్ల దరఖాస్తులు’

పెండింగ్ పెన్షన్లను విడుదల చేయాలని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాలన్నారు. కార్పొరేషన్ బలోపేతం, జిల్లాల్లో TCPC కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామన్నపేట MROకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 43.02 లక్షల మంది దివ్యాంగులు జీవిస్తున్నారని, 24.85 లక్షల చేయూత పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
News July 5, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.
News July 5, 2025
రామన్నపేట: ‘దేశంలో కార్పొరేట్లకు కొమ్ముకాస్తోన్న మోదీ’

దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, CITU మండల కన్వీనర్ గొరిగె సోములు అన్నారు. కార్మిక, రైతు, కూలీ వ్యతిరేక విధానాల అవలంబించే మోదీ ప్రభుత్వ మెడలు వంచేందుకే జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సకలజనులు పాల్గొనాలని కోరారు. రామన్నపేటలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించి మాట్లాడారు.