News March 30, 2024

ఈతకు వెళితే.. గొంతులో చేప ఇరుక్కుపోయింది

image

స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్(14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సగం చేపను మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.

Similar News

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

image

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News November 11, 2025

జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

image

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.

News November 11, 2025

ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

image

*అక్టోబర్ 9, 2005: దీపావళి తర్వాత రెండు రోజులకు 5.38PM-6.05PM మధ్య వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 67 మంది మరణించారు.
*సెప్టెంబర్ 13, 2008: 6.27PMకు పోలీసులకు మెయిల్ వచ్చింది. దానికి స్పందించే లోపు 9 వరుస పేలుళ్లు జరిగాయి. 5 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 25 మంది చనిపోయారు.
*నేడు జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.