News July 5, 2025
నిజామాబాద్: రేషన్ బియ్యానికి 48,978 మంది దూరం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.
Similar News
News July 5, 2025
HYD: అమెరికాలో మన పోలీస్కు ‘GOLD’ మెడల్

USలోని అల్బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్లోని DGP ఆఫీస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.
News July 5, 2025
HYD: అమెరికాలో మన పోలీస్కు ‘GOLD’ మెడల్

USలోని అల్బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్లోని DGP ఆఫీస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.
News July 5, 2025
ఇలా అయితే అప్పన్న భక్తులు నడిచేదెలా?

సింహాచలం గిరిప్రదక్షిణను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులకు కొన్నిచోట్ల ఇబ్బంది తప్పేలా లేదు. పెదగదిలి నుంచి హనుమంతువాక వరకు సర్వీసు రోడ్డులో కాంక్రీటు పిక్క తేలి ఉంది. చెప్పులు లేకుండా నడిచే లక్షలాది అప్పన్న భక్తుల కాళ్లకు పిక్క గుచ్చుకునే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు. గతేడాది కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే భక్తులకు ఎదురయ్యింది.