News July 5, 2025
కండక్టర్పై దాడి కేసులో ఇద్దరికి జైలు శిక్ష: సీఐ చిట్టిబాబు

ఆర్టీసీ కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో తోట్లవల్లూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ సుదీర్పై వీరభద్రరావు, ప్రదీప్ కుమార్ దాడి చేశారు. ఈ ఘటనలో కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది.
Similar News
News July 5, 2025
తోటపల్లి కాలువ ఖరీఫ్ సాగునీటిని విడుదల చేయనున్న మంత్రి

గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం నుంచి ఖరీఫ్కు ఈనెల 6న మంత్రి సంధ్యారాణి నాగావళి సాగునీటిని విడుదల చేస్తారని అధికారులు తోటపల్లి ప్రాజెక్ట్ AE నవీన్ వెల్లడించారు. మండలంలోని ఉల్లిభద్ర సమీప కుడి ప్రధాన కాలువ సున్నా పాయింట్ డైక్ వద్ద మంత్రి గేట్ల వద్ద బటన్ నొక్కి నాగావళి నీరు విడుదల చేస్తారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
News July 5, 2025
మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: ASF కలెక్టర్

జిల్లాలో చేపట్టిన మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్లో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పంచాయతరాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఆర్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
News July 5, 2025
DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?