News July 5, 2025
TU: CESSలో PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

తెలంగాణ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రొఫెసర్ రేవతి తెలిపారు. ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, పొలిటికల్ సైన్స్, కామర్స్ తదితర విభాగాల్లో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని పేర్కొన్నారు. వివరాలకు https.//cess.ac.in ను సందర్శించాలన్నారు.
Similar News
News July 5, 2025
NZB: భర్త గొంతు కోసిన భార్య

భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసిన ఘటన బోధన్(M) మినార్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసింది. దేశ్యనాయక్ను ఆయన భార్య సాలుబాయి శుక్రవారం రాత్రి కత్తితో గొంతు కోసింది. అరుపులు వినిపించడంతో స్థానికులు క్షతగాత్రున్ని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
News July 5, 2025
NRPT: ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి

జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 -26 సంవత్సరంలో జిల్లాలో 3500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, డ్రిప్, ఆయిల్పామ్ సాగుతో వచ్చే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
News July 5, 2025
బాసర IIITకి ఎల్లంపేట విద్యార్థుల ఎంపిక

బాసర IIITలో మొదటి విడతలో ప్రవేశాలకు ఎల్లంపేట జడ్పీహెచ్ఎస్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు మరిపెడ ఎంఈఓ అనిత దేవి తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదివిన మౌనిక, భానుప్రియ, అనూష, సాయి చరణ్, వశీకర్ సీటు సాధించినట్లు చెప్పారు. ఒకే పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడంతో ఎంఈఓతో పాటు ఎల్లంపేట హెచ్ఎం భాస్కరరావు విద్యార్థులను అభినందించారు.