News July 5, 2025

JGTL: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను రక్షించిన పోలీసులు

image

మంచిర్యాల్ జిల్లా చున్నంబట్టివాడకు చెందిన కొమిరి రజిత కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జగిత్యాల (D) ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చిన రజిత బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించింది. ఆ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు స్పందించి సమయస్ఫూర్తితో అడ్డుకొని ఆమెను కాపాడారు.

Similar News

News July 5, 2025

NZB: భర్త గొంతు కోసిన భార్య

image

భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసిన ఘటన బోధన్(M) మినార్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసింది. దేశ్యనాయక్‌ను ఆయన భార్య సాలుబాయి శుక్రవారం రాత్రి కత్తితో గొంతు కోసింది. అరుపులు వినిపించడంతో స్థానికులు క్షతగాత్రున్ని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

News July 5, 2025

NRPT: ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి

image

జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 -26 సంవత్సరంలో జిల్లాలో 3500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, డ్రిప్, ఆయిల్‌పామ్ సాగుతో వచ్చే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

News July 5, 2025

బాసర IIITకి ఎల్లంపేట విద్యార్థుల ఎంపిక

image

బాసర IIITలో మొదటి విడతలో ప్రవేశాలకు ఎల్లంపేట జడ్పీహెచ్ఎస్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు మరిపెడ ఎంఈఓ అనిత దేవి తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదివిన మౌనిక, భానుప్రియ, అనూష, సాయి చరణ్, వశీకర్ సీటు సాధించినట్లు చెప్పారు. ఒకే పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడంతో ఎంఈఓతో పాటు ఎల్లంపేట హెచ్ఎం భాస్కరరావు విద్యార్థులను అభినందించారు.