News July 5, 2025

మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

image

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News February 26, 2026

ఫిబ్రవరి 28న బిక్కవోలు జాబ్ మేళా

image

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.

News February 26, 2026

దేవరపల్లి: తలపై రాయి పడి కార్మికుడు మృతి

image

దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో అవిటి యేసు (42) అనే కార్మికుడు మృతి చెందాడు. పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు తలపై రాయి పడటంతో తీవ్ర గాయమైందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 26, 2026

రాజమండ్రి: కల్తీ పాలను చిటికెలో కనిపెట్టండి ఇలా!

image

నిత్యం మనం వాడే పాలు కల్తీ అవుతున్నాయా? ఈ చిన్న పరీక్షలతో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు సహజ సిద్ధమైన తీపి, క్రీమ్ వాసన కలిగి ఉంటాయని, చేదుగా లేదా రసాయన వాసన వస్తే అవి కల్తీవని గుర్తించాలి. కొద్దిపాటి పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు, ఆ పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపినట్లు నిర్ధారించుకోవాలని నిపుణులు తెలిపారు.