News July 5, 2025

అమలాపురం: విపస్యాన ధ్యాన పద్ధతిపై కలెక్టర్ సూచనలు

image

పని ఒత్తిడిని అధిగమించి మనశ్శాంతిని సాధించడానికి విపస్యాన ధ్యాన పద్ధతి సరైనదని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శనివారం విపస్యాన ధ్యాన కార్యక్రమంపై ఎంఈఓలు, హెచ్ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలలలో పిల్లలకు వయసు వారీగా విపస్యాన ధ్యాన కార్యక్రమాల నిర్వహణపై ఆయన వారికి సూచనలు చేశారు.

Similar News

News July 6, 2025

నిర్మల్ డిపో నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి కాణిపాకం, అరుణాచలం, పళని, రామేశ్వరం, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని మేనేజర్ కే.పండరి శనివారం తెలిపారు. జులై 9న అరుణాచలం బస్సు టికెట్ ఒకరికి రూ.4,900, సుదీర్ఘ ప్యాకేజీ రూ.7,500, శ్రీశైలానికి రూ.2,250 టికెట్ ధరతో అందుబాటులో ఉన్నాయన్నారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని చెప్పారు.

News July 6, 2025

MDK: సీజనల్ వ్యాధులపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

image

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. మే నెల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో వాతావరణ మార్పుల వల్ల ఆయా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని, గ్రేటర్ HYD పరిధిలో స్వల్పంగా కేసులు పెరిగాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

News July 6, 2025

పాలమూరు:పల్లె పోరు.. సన్నహాలు షురూ

image

స్థానిక సంస్థల పోరుకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలు ఉండగా.. 15,276 వార్డులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఓటరు జాబితా సవరణ, బూత్ వివరాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. MBNR-3,836, NGKL-4,140, GDWL-2,390, NRPT-2,544, WNPT-2,366 బూత్‌లు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. >SHARE IT