News July 5, 2025

ములుగు: దామోదర్ లొంగుబాటు అవాస్తవం: మావో లేఖ

image

మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ లొంగిపోతున్నట్లు సోషల్ మీడియా, పత్రిక, టీవీ ఛానల్లో వచ్చిన ప్రచారం అవాస్తవమని సీపీఐ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖ విడుదల చేశారు. పోలీసులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ద్రుష్పచారం చేస్తున్నారన్నారు. గతంలో దామోదర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇటీవల మంత్రి సీతక్కపై వచ్చిన లేఖకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

Similar News

News July 6, 2025

VJA: ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి’

image

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్-CA, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా JC ఎస్.ఇలక్కియా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్ట‌మ్స్‌, టూల్స్ ప్రొఫిష‌య‌న్సీ, ఫైలింగ్‌‌ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.

News July 6, 2025

అమ్రాబాద్: దివ్య శైవ క్షేత్రం లొద్ది మల్లయ్య ఆలయం

image

దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో, గుహలు, జలపాతాలు గలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం “లొద్ది మల్లయ్య ఆలయం. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది మూడున్నర వందల కోట్ల సంవత్సరాల పురాతన గుహ. ఇది హైదరాబాద్ -శ్రీశైలం వెళ్లే దారిలో 65 కి.మీ రాయి దగ్గర కుడి వైపు నుంచి లోయలోకి 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళితే ఈ గుహ వస్తుంది.

News July 6, 2025

కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

image

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.