News March 30, 2024

గురజాలలో లోకల్ మేనిఫెస్టో డైలాగ్ వార్

image

గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య లోకల్ మేనిఫెస్టోపై డైలాగ్ వార్ నడుస్తోంది. యరపతినేని ఆరు అంశాలతో లోకల్ మ్యానిఫెస్టో ప్రకటించగా అది సమగ్రంగా లేదని కాసు విమర్శించారు. 30 ఏళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు వ్యక్తిగత ఖర్చులతో మేనిఫెస్టో రూపొందించామని యరపతినేని అన్నారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై కాసు కూడా 10 అంశాలతో లోకల్ మేనిఫెస్టో ప్రకటించారు.

Similar News

News December 9, 2025

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఆరోగ్య అధికారి

image

జిల్లా ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేడ పురుగు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. జీజీహెచ్‌లో IGM ELISA పరీక్ష అందుబాటులో ఉంది. పొదలు, పొలాల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని, లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

News December 9, 2025

21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం: కలెక్టర్

image

ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. 5 సం.ల లోపు వయస్సు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 9, 2025

గుంటూరు జిల్లా డీఈఓగా సలీం బాషా

image

గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈఓ)గా షేక్ సలీం బాషా నియమితులయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఈఓగా, కృష్ణాజిల్లా DIET కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్న ఆయనను గుంటూరు బదిలీ చేస్తూ మంగళవారం విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు డీఈఓ రేణుకను ప్రకాశం జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.