News July 6, 2025
ADB: రేపే లాస్ట్.. విద్యార్థులు APPLY చేసుకోండి

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు ప్రభుత్వం HYDలో అందించే 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఉమ్మడి ADBలోని SC, ST, BC, మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భగత్ సునీత కుమారి తెలిపారు. డిగ్రీ పాసైన వారు ఈనెల 7 వరకు tsstudycircle.co.in వెబ్సైట్లో APPLY చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94941 49416 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News July 7, 2025
వాంకిడి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వాంకిడి టోల్ గేట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిరిడికి చెందిన నానబోయిన గణేశ్ <<16974734>>చికిత్స పొందుతూ<<>> నేడు మృతి చెందారు. కుటుంబీకుల వివరాలు.. గణేశ్ బెల్లంపల్లిలో బైక్ మెకానిక్గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
News July 7, 2025
అమ్రాబాద్: 536 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు- మంత్రి

ఇందిరమ్మ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 536 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజల ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆదివాసీలతో పాటు గిరిజనులకు అదనంగా 27 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
News July 7, 2025
సూర్య ఘర్ పథకం లక్ష్యాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సోమవారం అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల ముందంజలో ఉన్న జె.పంగులూరు, నగరం మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ అభినందించారు. సంతమాగులూరు, మార్టూరు, కొరిశపాడు, కొల్లూరు, బాపట్ల, వేమూరు మండలాల ఎంపీడీవోలను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.