News July 6, 2025
ADB: రేపే లాస్ట్.. విద్యార్థులు APPLY చేసుకోండి

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు ప్రభుత్వం HYDలో అందించే 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఉమ్మడి ADBలోని SC, ST, BC, మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భగత్ సునీత కుమారి తెలిపారు. డిగ్రీ పాసైన వారు ఈనెల 7 వరకు tsstudycircle.co.in వెబ్సైట్లో APPLY చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94941 49416 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News July 7, 2025
అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 7, 2025
వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా: Jr.NTR

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ‘వార్-2’పై యంగ్ టైగర్ NTR అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తైందని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘హృతిక్ సర్తో సెట్లో ఉంటే ఎప్పుడూ బ్లాస్టే. ఆయన ఎనర్జీ చాలా ఇష్టం. వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఆడియన్స్కు డైరెక్టర్ అయాన్ పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ సిద్ధం చేశారు. టీమ్కు థాంక్స్. AUG 14న ఈ ఫీల్ను మీరు ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.
News July 7, 2025
విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయగా బెయిల్ మంజూరు అయింది. గత నెల 23వ తేదీన నిర్వహించిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మహారాణిపేట సీఐ భాస్కరరావు ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలను సీఐకు సమర్పించారు.