News July 6, 2025

సిరిసిల్ల: IIITకి 24 మంది విద్యార్థులు ఎంపిక

image

గంభీరావుపేట మండలంలో 24 మంది విద్యార్థులు బాసర IIITకి ఎంపికైనట్లు మండల విద్యాధికారి సంటి గంగారం తెలిపారు. మండలంలోని లింగన్నపేట, మల్లారెడ్డిపేట, సముద్ర లింగాపూర్, దమ్మన్నపేట, కొత్తపల్లి, గజ సింగవరం, ముచర్ల, నాగంపేట గ్రామాలకు చెందిన ZPHS విద్యార్థులు బాసర IIITలో సీట్లు సాధించారన్నారు. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News July 7, 2025

రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించండి: CM రేవంత్

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న TG CM రేవంత్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా, జాతీయ, అంతర్జాతీయ తదితర ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అథ్లెట్లకు ట్రైనింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు రైల్వే టికెట్లలో రాయితీని పునరుద్ధరించాలని సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News July 7, 2025

గద్వాల్: నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

image

జిల్లా నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌) ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. అర్హులు 92814 23575, 23576,23577 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 7, 2025

GWL: SP ప్రజావాణికి 19 ఫిర్యాదులు

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సివిల్ అంశాలకు సంబంధించిన సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ విభేదాలకు సంబంధించిన అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.