News March 30, 2024

HYD: 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాం!

image

GHMC పరిధిలోని 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, MLAల బలం అవసరమని భావిస్తోంది. ఇప్పటికే చేరికలు ప్రారంభం కాగా.. ఈ నియోజకవర్గాల పరిధిలో మరికొంతమంది MLAలను పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఐదుగురు MLAలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు మరికొందరు చేరే అవకాశం ఉందని సమాచారం.

Similar News

News October 28, 2025

HYD: ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

image

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. ​పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్‌లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT

News October 28, 2025

జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్‌రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.

News October 28, 2025

క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

image

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ‌గా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.