News July 6, 2025
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.
Similar News
News July 7, 2025
రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించండి: CM రేవంత్

ఢిల్లీ పర్యటనలో ఉన్న TG CM రేవంత్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా, జాతీయ, అంతర్జాతీయ తదితర ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అథ్లెట్లకు ట్రైనింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు రైల్వే టికెట్లలో రాయితీని పునరుద్ధరించాలని సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
News July 7, 2025
గద్వాల్: నిరుద్యోగ యువత ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. అర్హులు 92814 23575, 23576,23577 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News July 7, 2025
GWL: SP ప్రజావాణికి 19 ఫిర్యాదులు

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సివిల్ అంశాలకు సంబంధించిన సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ విభేదాలకు సంబంధించిన అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.