News July 6, 2025
వత్సవాయిలో ప్రమాదం.. ఒకరి మృతి

వత్సవాయి నుంచి వైరా వెళ్లే రహదారిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో తాళ్లూరు వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, పెనుగొండ బాల, రాయల రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 6, 2025
భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

కజకిస్థాన్లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.
News July 6, 2025
జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.
News July 6, 2025
చీరాల: కుక్కను ఢీకొని ఆగిన వందే భారత్

విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ ఆదివారం సాయంత్రం కుక్కను ఢీకొనడంతో 20 నిమిషాలు ఆగిపోయింది. ఈ ఘటన కారంచేడు రైల్వే గేట్ సమీపంలో జరిగింది. రైల్వే అధికారులు సమాచారం ప్రకారం.. కుక్క కళేబరం బ్రేక్ సిస్టంకి అడ్డుపడింది. ఈ కారణంగా సాంకేతిక లోపం ఏర్పడగా గుర్తించిన లోకో పైలట్లు రైలు ఆపేశారు.