News July 6, 2025
జగిత్యాల: మిస్టరీగా 5 ఏళ్ల చిన్నారి మృతి!

కోరుట్లలోని <<16959055>>5 ఏళ్ల చిన్నారి మృతి <<>>కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని బాలిక హితీక్ష ప్రమాదవశాత్తు మరణించిందా లేదా హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన చిన్నారి భయంతో బాత్రూంలో దాక్కోగా కాలుజారి అక్కడే ఉన్న నల్లాపై పడి చనిపోయిందనే అనుమానమూ వ్యక్తమవుతోంది. బాలిక తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటున్నారు.
Similar News
News July 6, 2025
విజయవాడ: దుర్గమ్మను దర్శించుకున్న 60 వేల మంది భక్తులు

విజయవాడ దుర్గమ్మను ఆదివారం 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు 500 బృందాలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించాయన్నారు. నేడు తొలి ఏకాదశి, ఆదివారం కావడంతో ఆషాఢ సారె సమర్పణకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు 1,000 మంది వాలంటీర్ల సేవలు వినియోగించుకున్నామని అన్నారు.
News July 6, 2025
మంత్రి లోకేశ్కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.
News July 6, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> గానుగుపహాడ్ బ్రిడ్జి వద్ద బీజేపీ, బీఆర్ఎస్ నిరసన
> స్టేషన్ ఘనపూర్: ప్రమాదం అంచున విద్యార్థుల ప్రయాణం!
> జనగామలో కొనసాగుతున్న “మన జిల్లా మన నీరు” కార్యక్రమం
> జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
> జనగామ: అండర్ గ్రౌండ్ మోరీ పనులు పూర్తి చేయాలని డిమాండ్
> జనగామలో కరెంటోళ్ల నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
> స్థానిక ఎన్నికల్లో గెలుపుకు కృషి చేద్దాం: రాజయ్య
> దేవరుప్పులలో వర్షం