News July 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుత సంచారం

image

మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ అటవీ ప్రాంతంలోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత సంచారంపై 4 రోజులుగా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని రైతులు అన్నారు. శనివారం గుట్టలోని గుండుపై చిరుత కనిపించగా పొలాల వద్ద పశువులు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. అప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News July 6, 2025

విజయవాడ: శక్తిసేవకుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు

image

ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీని సమన్వయ పరిచేందుకు 100 మంది శక్తి సేవకులను వినియోగించుకున్నామని EO శీనానాయాక్ తెలిపారు. కనకదుర్గానగర్ నుంచి మహా మండపం 7వ అంతస్తు వరకు వీరు భక్తుల క్యూలైన్‌లను సమన్వయ పరిచారన్నారు. శక్తి సేవకులలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఆలయ అధికారులు సుమారు 13 గంటల నిరంతర పర్యవేక్షణ జరపడంతో భక్తుల రద్దీ తగ్గిందని EO చెప్పారు.

News July 6, 2025

‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

image

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.

News July 6, 2025

విజయవాడ: దుర్గమ్మను దర్శించుకున్న 60 వేల మంది భక్తులు

image

విజయవాడ దుర్గమ్మను ఆదివారం 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు 500 బృందాలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించాయన్నారు. నేడు తొలి ఏకాదశి, ఆదివారం కావడంతో ఆషాఢ సారె సమర్పణకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు 1,000 మంది వాలంటీర్‌ల సేవలు వినియోగించుకున్నామని అన్నారు.