News March 30, 2024
MBNR: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దిన కూలీ రూ.272 ఉండగా.. ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.300 కానుంది. దీంతో కూలీలకు అదనంగా రూ.28 లభించనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14.50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వ్యవసాయేతర పనులకు వెళితే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు.
Similar News
News September 9, 2025
MBNR: ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. CONGRATS తెలిపిన డీకే అరుణ

భారత ఉపరాష్ట్రతిగా NDA అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో విజయం సాధించారు. ఇవాళ ఉదయం డీకే అరుణ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు.
News September 9, 2025
రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సిరిసిల్ల రాజయ్య రాక

రేపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య రానున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలకనున్నారు.
News September 9, 2025
తెలుగు యూనివర్శిటీ తొలి Ph.D అందుకున్నది పాలమూరు వ్యక్తే!

MBNRకు చెందిన కపిలవాయి లింగమూర్తి TG ఏర్పడ్డ తర్వాత తెలుగు వర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి. సుమారు 7 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి 2014లో తెలుగు యూనివర్శిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డీలిట్)ను ప్రదానం చేసింది. ప్రతిభ పురస్కారం కూడా అందుకున్నారు. నేడు TG భాషా దినోత్సవం సందర్భంగా Way2News ప్రత్యేక కథనం.