News July 6, 2025

HYD: విద్యుత్ సమస్యలపై ప్రతి బుధవారం ముఖాముఖి

image

గ్రేటర్ HYD నగరం పరిధిలో ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని ఎండి ముషారఫ్ అలీ ఆదేశించారు. విద్యుత్ శాఖ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సైతం ఉపయోగించనున్నట్లు తెలిపారు. విద్యుత్ డిమాండ్, హెచ్చుతగ్గుల గుర్తింపు, అంతరాయాల నియంత్రణ కోసం ఈ సేవలు సైతం ప్రారంభం కానున్నాయి. స్థానికంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

రెవెన్యూ సమస్యలకు త్వరలోనే చెక్: మండపల్లి

image

రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన 22 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News July 6, 2025

మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

image

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

News July 6, 2025

ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలి: అమర్నాధ్

image

వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్ అన్నారు. రోలుగుంటలో ఆదివారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కార్యకర్త ప్రజలకు వివరించాలని అమర్నాధ్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికునిలా ఇప్పటి నుంచే పని చేయాలని పిలుపునిచ్చారు.