News July 6, 2025
కన్నాయిగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన దెయ్యం చేప

కన్నాయిగూడెం మండలంలోని మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీంతో జాలర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దెయ్యం చేపగా పిలుచుకునే ఈ చేప తినడానికి, ఔషధాల తయారీకి కూడా పనికిరాదని మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ చేప నదిలో, చెరువులో ఎక్కడున్నా మిగతా చేపలను, వాటి గుడ్లను తినడం వంటి లక్షణాలున్న ప్రమాదకరమైన చేప అన్నారు. ఈ చేపలు ఉన్నచోట మిగతా చేపలు కూడా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News July 6, 2025
మంత్రి లోకేశ్కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.
News July 6, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> గానుగుపహాడ్ బ్రిడ్జి వద్ద బీజేపీ, బీఆర్ఎస్ నిరసన
> స్టేషన్ ఘనపూర్: ప్రమాదం అంచున విద్యార్థుల ప్రయాణం!
> జనగామలో కొనసాగుతున్న “మన జిల్లా మన నీరు” కార్యక్రమం
> జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
> జనగామ: అండర్ గ్రౌండ్ మోరీ పనులు పూర్తి చేయాలని డిమాండ్
> జనగామలో కరెంటోళ్ల నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
> స్థానిక ఎన్నికల్లో గెలుపుకు కృషి చేద్దాం: రాజయ్య
> దేవరుప్పులలో వర్షం
News July 6, 2025
పర్యాటకులకు స్వర్గధామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం: లక్ష్మీశా

ఎన్టీఆర్ జిల్లాను పర్యాటకులకు స్వర్గధామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం ఆయన విజయవాడ భవానీ ఐలాండ్ను పరిశీలించారు. సెల్ఫీ పాయింట్లు, మేజ్ గార్డెన్, బోటింగ్ పాయింట్లను ఆయన పరిశీలించారు. ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఈ రంగంలో స్థూల విలువ (జీవీఏ) పెంచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.