News July 6, 2025

VJA: ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

image

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు నిన్న విజయవాడలోని క్షత్రియ భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉదయం వాకింగ్‌కు వెళ్తానని చెప్పి సూసైడ్ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్త మరణానికి బుద్దిరాజు శివాజీ, పిన్నమనేని పరంధామయ్యలే కారణమని భార్య శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 6, 2025

విజయవాడ: శక్తిసేవకుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు

image

ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీని సమన్వయ పరిచేందుకు 100 మంది శక్తి సేవకులను వినియోగించుకున్నామని EO శీనానాయాక్ తెలిపారు. కనకదుర్గానగర్ నుంచి మహా మండపం 7వ అంతస్తు వరకు వీరు భక్తుల క్యూలైన్‌లను సమన్వయ పరిచారన్నారు. శక్తి సేవకులలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఆలయ అధికారులు సుమారు 13 గంటల నిరంతర పర్యవేక్షణ జరపడంతో భక్తుల రద్దీ తగ్గిందని EO చెప్పారు.

News July 6, 2025

‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

image

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.

News July 6, 2025

విజయవాడ: దుర్గమ్మను దర్శించుకున్న 60 వేల మంది భక్తులు

image

విజయవాడ దుర్గమ్మను ఆదివారం 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు 500 బృందాలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించాయన్నారు. నేడు తొలి ఏకాదశి, ఆదివారం కావడంతో ఆషాఢ సారె సమర్పణకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు 1,000 మంది వాలంటీర్‌ల సేవలు వినియోగించుకున్నామని అన్నారు.