News July 6, 2025

కోటపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

image

కోటపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

వాంకిడి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వాంకిడి టోల్ గేట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిరిడికి చెందిన నానబోయిన గణేశ్ <<16974734>>చికిత్స పొందుతూ<<>> నేడు మృతి చెందారు. కుటుంబీకుల వివరాలు.. గణేశ్ బెల్లంపల్లిలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

News July 7, 2025

అమ్రాబాద్: 536 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు- మంత్రి

image

ఇందిరమ్మ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 536 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజల ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆదివాసీలతో పాటు గిరిజనులకు అదనంగా 27 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

News July 7, 2025

సూర్య ఘర్ పథకం లక్ష్యాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సోమవారం అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల ముందంజలో ఉన్న జె.పంగులూరు, నగరం మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ అభినందించారు. సంతమాగులూరు, మార్టూరు, కొరిశపాడు, కొల్లూరు, బాపట్ల, వేమూరు మండలాల ఎంపీడీవోలను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.