News July 6, 2025
వికారాబాద్ జిల్లాలో పకడ్బందీగా ఉపాధి హామీ

వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సంచాలకురాలు సృజన ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఉపాధి హామీలో ఫిర్యాదులు వస్తే 15 రోజుల్లో విచారించి పరిష్కరించాలని ఆమె చెప్పారు. జిల్లాలో 1,86,179 జాబ్ కార్డులు ఉండగా.. 1,28,080 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నాయి. ప్రస్తుతం 3,78,855 మంది కూలీలు పనిచేస్తున్నారు.
Similar News
News July 7, 2025
కరీంనగర్: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది కరీంనగర్ జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712670759 నంబర్కు ఫోన్ చేయాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News July 7, 2025
డార్క్ చాక్లెట్ తినడం వల్ల లాభాలు!

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది
News July 7, 2025
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

తోతాపురి మామిడి రైతులకు మన ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర ఇతర రాష్ట్రాలకే ఆదర్శమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 5వ తేదీ నుంచే రైతులకు అదనంగా రూ.4(కేజీకి) చెల్లిస్తున్నట్లు చెప్పారు. ధరలను పర్యవేక్షించడానికి ఉద్యాన, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రైతు నుంచి చివరి వరకు మామిడి కొనుగోలు చేస్తామన్నారు.