News March 30, 2024

సుల్తానాబాద్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ శాస్త్రీనగర్‌కు చెందిన పల్స శివసాయి(22) కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కారు నిర్వహణ కోసం 3 నెలల క్రితం ఓ వ్యక్తి వద్ద రూ.70వేలు అప్పు చేశాడు. ఈనెల 27న అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి అప్పు తీర్చాలంటూ కారు తీసుకెళ్లాడు. మనస్తాపం చెందిన తను పురుగు మందు తాగాడు. MGMకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

Similar News

News November 2, 2025

KNR: ‘రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు సీఈఓ లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పాల్గొన్నారు.

News November 2, 2025

KNR: పీఎఫ్‌, డిపాజిట్లపై అవగాహన ముఖ్యం: కమిషనర్

image

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్‌ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ కేవైసీ, ఫోన్ నంబర్, అడ్రస్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.

News November 2, 2025

KNR: క్లెయిమ్ చేయని ఆస్తులపై క్లారిటీ ఇవ్వాలి: కలెక్టర్‌

image

క్లెయిమ్ చేయకుండా వదిలేసిన ఆస్తులపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ పమోలు సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు, నామినీ వివరాలు తప్పనిసరిగా నింపాలని సూచించారు. ఉద్యోగం/ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లను చాలామంది పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.