News March 30, 2024
పత్తికొండ: అత్యధిక మెజార్టీ ఆ మహిళకే…!

పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరగిన అసెంబ్లీ ఎన్నికలలో కంటే 2019 ఎన్నికలలో కే. శ్రీదేవీ YCP నుంచి పోటీచేసి TDP అభ్యర్థి కే.ఈ శ్యాంబాబుపై 42.065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలకు కూడా YCP అధిష్ఠానం ఈమెకే మళ్లీ అవకాశమిచ్చింది. ఈమెకు ప్రత్యర్థిగా TDP అధిష్ఠానం కూడా కే. ఈ శ్యాంబాబును బరిలో దింపింది. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరి సొంతమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 11, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 153 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,242 మందికి గానూ 4,089 మంది మాత్రమే హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
News March 11, 2026
OTPలు ఎవరికీ చెప్పకండి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు RBI రూపొందించిన పోస్టర్లను జేసీ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు ‘డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్’ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాంక్ అధికారులమని చెప్పినా ఎవరికీ OTP చెప్పకూడదన్నారు. కేవలం బ్యాంక్ అధికారిక యాప్స్, వెబ్సైట్ల ద్వారానే లావాదేవీలు చేయాలన్నారు.
News March 10, 2026
కర్నూలు: రూ.14,740 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

KNL కలెక్టరేట్లో నాబార్డు రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసి నూరుల్ ఖమర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాలన్నరు. మొత్తం రుణ అంచనా రూ.14,740 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,283 కోట్లు, విద్యా రుణాలు రూ.203 కోట్లు, MSME 3,653 కోట్లు, గృహ రుణాలు రూ.287 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది.


