News July 7, 2025

250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

image

ఇబ్రహీంపట్నంలోని మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్ వ‌ద్ద 250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం పర్యాటక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ.. జంగిల్ స‌ఫారీ, బ‌యోడైవ‌ర్సిటీ పార్క్, నేచ‌ర్ ట్ర‌య‌ల్స్ ఏర్పాటు ద్వారా మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా జిల్లా దార్శనిక ప్రణాళిక తయారైందన్నారు.

Similar News

News July 7, 2025

జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

image

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

News July 7, 2025

మహబూబ్ నగర్ IIIT.. నేడు కౌన్సెలింగ్

image

మహబూబ్ నగర్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన IIITలో 181 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. నేడు S.NO:1 నుంచి 564 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే E-Mail admissions@rgukt. ac.in, 90525 95661,73825 95661 సంప్రదించాలన్నారు. SHARE IT

News July 7, 2025

ఉమ్మడి పాలమూరు “CRICKET” జట్టు ఇదే!

image

శ్రీకాంత్( కెప్టెన్)-SDNR, MOHD షాబాద్( వైస్ కెప్టెన్)-MBNR, అబ్దుల్ రాపే(MBNR), MD ముఖిత్(MBNR), జయసింహ(పెబ్బేర్), శ్రీకాంత్(MBNR), అక్షయ్(NRPT), సంజయ్(MBNR), ఛత్రపతి(GDWL), రామ్ చరణ్(NGKL), గగన్(NGKL), శశాంక్(MBNR), హర్షిత్(JDCL), కేతన్ కుమార్(JDCL), అక్షయ్ సాయి(JDCL), జస్వంత్(NGKL). నేటి నుంచి ప్రారంభమయ్యే B-డివిజన్ టుడే లీగ్ ఛాంపియన్షిప్‌లో 16 మందితో కూడిన ఈ జట్టు పాల్గొననుంది.