News July 7, 2025
జుక్కల్: మంత్రి వర్యా.. అలంకించండి

జుక్కల్ నియోజకవర్గంలో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పిట్లం మండలం హస్నాపూర్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, కామారెడ్డి-సంగారెడ్డి అంతర్ జిల్లాల రోడ్డు నిర్మాణానికి పడిన అడుగులు ఆగిపోయాయి. నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ పనులు.. ఇలా మరెన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేస్తారో చూడాలి.
Similar News
News July 7, 2025
సిద్దిపేట: ‘ప్రతిభ చూపే వారిని గుర్తిస్తాం’

ప్రతిభ చూపే అధికారులు, సిబ్బందిని గుర్తించి, వారిని ప్రోత్సహించేలా రివార్డులు, అవార్డులు, సేవా పతకాలు ఇస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. అతి ఉత్కృష్ట సేవా పతక్కు ఎంపికైన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీపీ ఆయనను అభినందించారు. అతి ఉత్కృష్ట సేవా పతక్ను త్వరలో అందజేస్తామని తెలిపారు.
News July 7, 2025
పేరెంట్స్-టీచర్ మీటింగ్కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.
News July 7, 2025
ప్రభుత్వాన్ని నిలదీయాలి: గుడివాడ అమర్నాథ్

వైసీపీ శ్రేణులు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కూటమి నాయకులు లేనిపోని హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలుకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.