News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News July 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.

News July 7, 2025

నిర్మల్: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఆమె నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆమె అన్నారు. “వనం ఉత్సవాలలో” భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అందరూ మొక్కలు నాటాలని కోరారు.

News July 7, 2025

మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ USలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీమార్కెట్లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో $315.35 వద్ద ముగిసిన షేరు ధర తాజాగా $291.96కు పడిపోయింది. ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు. టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 206%కు పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం.