News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News July 7, 2025

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.

News July 7, 2025

మహిళలు శక్తిమంతులు: సిద్దిపేట కలెక్టర్

image

మహిళలు శక్తిమంతులని, వారి పనికి వెలకట్టలేమని, వర్తక, వ్యాపార రంగంలోనూ ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అనే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా సమాఖ్య భవనం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు.

News July 7, 2025

ఖాజాగూడ భూకబ్జా కేసులో హైకోర్టు నోటీసులు

image

ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మురళీనాయక్, కూచుకుల్ల రాజేశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. షోహిని బిల్డర్స్, బెవర్లీ హిల్స్‌తో సహా ఐదుగురు ప్రైవేట్ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రెండువారాల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది.