News July 7, 2025

పటాన్‌చెరు: మృతదేహాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

image

పటానుచెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కొనసాగుతోందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అంబులెన్స్, పోలీస్ ఎస్కార్ట్‌తో పాటు మృతదేహాల అప్పగింత పనులు సజావుగా జరగాలని అధికారులను ఆదేశించించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

Similar News

News July 7, 2025

నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

image

TG: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా AP నీటిని తరలించుకుపోతోంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని వాడుకోవడం రేవంత్‌కు చేతకావట్లేదు. కాంగ్రెస్ సర్కారు గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది’ అని అన్నారు.

News July 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.

News July 7, 2025

నిర్మల్: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఆమె నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆమె అన్నారు. “వనం ఉత్సవాలలో” భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అందరూ మొక్కలు నాటాలని కోరారు.