News July 7, 2025
NLG: తీవ్ర విషాదం.. తండ్రి, కుమారుడు మృతి

ఆగి ఉన్న కారును కంటైనర్ ఢీకొనడంతో కారులో ఉన్న తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. HYD నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆపిన ఓ కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన తండ్రి, కుమారుడు నాగేశ్వరరావు(44), అభిషేక్ (21) మృతి చెందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపారు.
Similar News
News July 7, 2025
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: సిద్దిపేట కలెక్టర్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడీఓసీలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్తో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.
News July 7, 2025
MBNR: HCA 2డే లీగ్.. మొదటి రోజు మనదే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి B- డివిజన్ 2డే లీగ్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు మొదటి రోజు సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. అనంతరం రాకేష్-XI జట్టు 19.1 ఓవర్లలో 55/6 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టులో శ్రీకాంత్-71, సంజయ్-69 పరుగులు చేయగా.. గగన్ 4 వికెట్లు తీశారు. మహబూబ్ నగర్ 188 పరుగుల లీడ్లో ఉంది.
News July 7, 2025
సిద్దిపేట: ‘ప్రతిభ చూపే వారిని గుర్తిస్తాం’

ప్రతిభ చూపే అధికారులు, సిబ్బందిని గుర్తించి, వారిని ప్రోత్సహించేలా రివార్డులు, అవార్డులు, సేవా పతకాలు ఇస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. అతి ఉత్కృష్ట సేవా పతక్కు ఎంపికైన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీపీ ఆయనను అభినందించారు. అతి ఉత్కృష్ట సేవా పతక్ను త్వరలో అందజేస్తామని తెలిపారు.