News July 7, 2025
అన్నమయ్య: భార్య కాపురానికి రాలేదని సూసైడ్

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలివీడు(M) మల్లసానివాళ్లపల్లెకు చెందిన తుపాకుల గోపాల్(37)కు పెద్దమండ్యానికి చెందిన రమణమ్మతో పదేళ్ల కిందట పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రమణమ్మ పుట్టింటికి వెళ్లింది. ఆమె కాపురానికి రావడం లేదని, తాను చనిపోతానని తల్లిదండ్రులకు గోపాల్ చెప్పాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
Similar News
News July 7, 2025
గద్వాల్: నిరుద్యోగ యువత ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. అర్హులు 92814 23575, 23576,23577 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News July 7, 2025
GWL: SP ప్రజావాణికి 19 ఫిర్యాదులు

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సివిల్ అంశాలకు సంబంధించిన సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ విభేదాలకు సంబంధించిన అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.
News July 7, 2025
VZM: కలెక్టరేట్కు 194 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.