News July 7, 2025

నిజాంపేట్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నిజాంపేట్ మండలానికి చెందిన గంగరబోయిన అంజమ్మ(45) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిజాంపేట్ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా అల్లాదుర్గ్ శివారులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఆమెను జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News July 7, 2025

పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.

News July 7, 2025

ప్రభుత్వాన్ని నిలదీయాలి: గుడివాడ అమర్నాథ్

image

వైసీపీ శ్రేణులు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కూటమి నాయకులు లేనిపోని హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలుకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

News July 7, 2025

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.