News July 7, 2025

హుజూర్‌నగర్: ట్రాక్టర్ పైనుంచి పడి మహిళా కూలీ మృతి

image

ట్రాక్టర్ పైనుంచి జారిపడి మహిళా కూలీ మృతిచెందిన ఘటన రఘునాథపాలెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. హుజూర్‌నగర్(M) గోపాలపురానికి చెందిన అలకుంట నవనీత(27) ఇంటి స్లాబ్ పనికి వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వస్తుండగా మట్టంపల్లి(M) రఘునాధపాలెం గ్రామశివారులో డ్రైవర్ అకస్మాత్తుగా కటింగ్ ఇవ్వడంతో ట్రాక్టర్‌పై కూర్చున్న ఆమె అదుపుతప్పి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన నవనీతను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

Similar News

News July 7, 2025

తిరువణ్ణామలై నుంచి విజయవాడకు స్పెషల్ ట్రైన్‌లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై) నుంచి నరసాపురంకు స్పెషల్ రైళ్లు నడపనున్నారు. జులై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెప్టెంబర్ 4, 25 తేదీలలో నం.07220 తిరువణ్ణామలై-నరసాపురం రైలు నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడతో పాటు కైకలూరు, గుడివాడలో ఆగుతాయన్నారు. పై తేదీలలో ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరే ఈ రైళ్లు తర్వాతి రోజు అర్ధరాత్రి 2 గంటలకు నరసాపురం చేరుకుంటాయన్నారు.

News July 7, 2025

వాంకిడి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వాంకిడి టోల్ గేట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిరిడికి చెందిన నానబోయిన గణేశ్ <<16974734>>చికిత్స పొందుతూ<<>> నేడు మృతి చెందారు. కుటుంబీకుల వివరాలు.. గణేశ్ బెల్లంపల్లిలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

News July 7, 2025

అమ్రాబాద్: 536 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు- మంత్రి

image

ఇందిరమ్మ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 536 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజల ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆదివాసీలతో పాటు గిరిజనులకు అదనంగా 27 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.