News July 7, 2025

వరంగల్: వారికి పెన్షన్లు ఎప్పుడు వచ్చెనో..?

image

ఉమ్మడి జిల్లాలో పలువురు దివ్యాంగులకు ఏళ్ల తరబడి పెన్షన్లు అందడం లేదు. గతంలో జిల్లా స్థాయి మెడికల్ బోర్డులో తిరస్కరించగా.. దానిపై రాష్ట్ర మెడికల్ బోర్డుకు కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 375, జనగామలో 90 అప్పీళ్లు ఉన్నాయి. HNK, BHPL, WGL, ములుగులోను వంద లోపు అప్పీళ్లు వచ్చాయి. వాటిని పరిష్కరించి, పథకాలకు అర్హులుగా అయ్యేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.

Similar News

News July 7, 2025

ఆనందపురం: లారీని ఢీకొన్న కారు.. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

image

ఆనందపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పార్వతీపురం జియమ్మవలసకు చెందిన కరకవలస రమణమూర్తి తన కుమారుడితో కలిసి కారులో మద్దిలపాలెంలోని అల్లుడు ఇంటికి వస్తున్నారు. ఆనందపురం హైవే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొంది. రమణమూర్తి అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలపాలైన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించినట్లు ఆనందపురం సీఐ తెలిపారు.

News July 7, 2025

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

image

AP: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ఇవాళ 880 అడుగులకు నీరు చేరింది. దీంతో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్యామ్ గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. నదీ జలాలకు చీరసారెను ఆయన సమర్పించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News July 7, 2025

దరఖాస్తు సమర్పించిన రోజే.. సమస్య పరిష్కారం.!

image

ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన తుపాకుల శైలజకు 2022లో YSR కాలనీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా, అప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఇల్లు తీసుకోలేదు. దీంతో సోమవారం శైలజ ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు దరఖాస్తు అందించింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు శైలజ కృతజ్ఞతలు తెలిపింది.