News March 30, 2024
కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆ మొత్తానికి పన్ను చెల్లించాలంటూ IT శాఖ నోటీసులు పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. తన పాన్కార్డుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2021 నుంచి ముంబై, ఢిల్లీలో ఆ కంపెనీ వ్యాపారాలు చేసిందట. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 5, 2024
రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..
అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!
News October 5, 2024
జమ్మూకశ్మీర్లో రాజకీయ వేడి
ఎన్నికల ఫలితాలు వెలువడకముందే JKలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. J&K Reorganisation Act, 2019 సహా జులై, 2023లో చేసిన సవరణల ద్వారా ఐదుగురు MLAలను LG నామినేట్ చేయగలరు. కేంద్ర హోం శాఖ సూచలన మేరకు ఆయన ఐదుగురిని నియమించనున్నారు. వీరికి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కల్పిస్తే Halfway Mark 45కి బదులుగా 48 అవుతుంది. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి.
News October 5, 2024
హరియాణాలో అన్ని సర్వేలూ కాంగ్రెస్కే అనుకూలం
హరియాణాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్(45-50), CNN(59), రిపబ్లిక్ మ్యాట్రిజ్(55-62), దైనిక్ భాస్కర్(44-54) సంస్థలు అంచనా వేశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ సమస్యలు, అగ్నివీర్ అంశాలు, మహిళా రెజ్లర్ల అందోళన బీజేపీకి ప్రతికూలంగా మారినట్టు పేర్కొన్నాయి.