News July 7, 2025

బల్దియా సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

image

అట్టహాసంగా ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కొద్దీ సేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించి బయటకు వచ్చారు. భద్రకాళి చెరువు విషయంలో చర్చ లేవనెత్తడంపై మేయర్ సుధారాణి అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు అసహనానికి గురయ్యారు. దీంతో సమావేశాన్ని బహిష్కరించి బయటికు వచ్చి నిరసన చేపట్టారు.

Similar News

News July 8, 2025

HNK: గడువు దాటిన చెక్కులు పంపిణీ చేసిన MLA కౌశిక్ రెడ్డి

image

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గడువు దాటిన కళ్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం పంపిణీ చేశారని లబ్ధిదారులు తెలిపారు. బ్యాంకులో వేయడానికి వెళ్తే తీరా గడువు దాటిందని సిబ్బంది చెప్పడంతో ఆవాక్కయ్యారన్నారు. అయితే ఆ చెక్కుల్లో కొన్ని గడువు దాటాయని, మరికొన్ని బానే ఉన్నట్లు బాధితులు తెలిపారు. సకాలంలో పంపిణీ చేయాల్సిన చెక్కులను గడువు దాటిన తర్వాత పంపిణీ చేయడానికి కారణమేంటని మండిపడుతున్నారు.

News July 8, 2025

జులై 8: చరిత్రలో ఈరోజు

image

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం

News July 8, 2025

ఆర్టీసీ వరంగల్-2 డిపో డీఎంగా రవిచందర్

image

వరంగల్ రీజియన్‌లోని వరంగల్-2 డిపో మేనేజర్‌గా ఎం.రవిచందర్‌ను నియమిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం వరంగల్-2 డిపో మేనేజర్‌గా పనిచేసిన జ్యోత్స్న ఖమ్మం రీజియన్ ఏవోగా బదిలీ అయ్యారు. దీంతో పరకాల డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న రవిచందర్‌ను వరంగల్-2 డిపోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.